IPL ఫైనల్ మ్యాచ్‌కు గిన్నిస్ రికార్డు, ఏ మ్యాచ్? ఎందుకో తెలుసా? *Cricket | Telugu OneIndia
  • last year
IPL 2022 FINAL gets Guinness World Record certificate for highest attendance | ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఐపీఎల్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు వరించింది.ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఐపీఎల్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు వరించింది. ఈ ఏడాది మే 29న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ఈ పురస్కారం లభించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మోతేరా స్టేడియం వేదికగా ఈ టైటిల్ ఫైట్ జరగగా.. రికార్డు స్థాయిలో 101, 566 మంది ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూశారు. ఓ క్రీడా ఈవెంట్‌కు ఇంతమంది హాజరుకావడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కింది. ఈ విషయాన్ని స్వయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్లే గుర్తించి బీసీసీఐకి అవార్డు కూడా అందజేశారు.

#IPL2022
#BCCI
#GujaratTitans
#RajasthanRoyals
#JaySha
#GuinnessWorldRecord
Recommended