చింత‌మ‌నేని పై పోటీ కి.... మ‌హిళా అభ్య‌ర్థిని నిలబెట్టిన పవన్..!! | Oneindia Telugu
  • 5 years ago
Socialist activist Ghantantala Venkatalakshmi was donning the Janesena from Denduluru constituency. Venkatlakshmi, fighting for women empowerment and the BC welfare.
#2019elections
#appolitics
#janasena
#ysrcp
#Venkatlakshmi
#Socialistactivist
#Denduluruconstituency
#VattiVasanthkumar
#vanajakshi
#pawankalyan

ఏపి ఎన్నిక‌ల్లో జ‌న‌సైనికుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ని మొద‌లుపెట్టిన‌ట్టు తెలుస్తోంది. రాజ‌కీయాల్లో మార్పు తెస్తాన‌న్న ప‌వన్ ఆదిశ‌గా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. 'చింతమనేని లాంటి రౌడీని ఓడించడానికి ఒక వీరమహిళను నిలబెడతాను'అంటూ గతంలో ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నంత పనీ చేశారు. దెందులూరు నియోజకవర్గం నుంచి జనసేన తరపున సామజిక ఉద్యమకారిణి ఘంటశాల వెంకటలక్ష్మిని బరిలో దింపారు. ఘంటశాల వెంకటలక్ష్మి, మహిళలు, బీసీల సాదికారిత కోసం ఉద్యమ బాటలో వున్నారు. సారా వ్యతిరేక ద్యమంలో పాల్గొన్నారు. ఐద్వా తరపున సామాజిక అంశాలపై ఆందోళనను చేపడుతుంటారు. ఇక ఏపీలో వివాదాస్పద రాజ‌కీయ నేత‌ల్లో చింతమనేని ప్రభాకర్ ముందుంటారు కాబ‌ట్టి ఆయ‌న‌ను మొద‌ట‌గా టార్గెట్ చేసారు జ‌న‌సేనాని.
Recommended