Lok Sabha Election 2019: Bhubaneswar State Profile, Sitting MP, MP Performance Report
  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Bhubaneswar Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Bhubaneswar.
#LokSabhaElection2019
#Bhubaneswarloksabhaconstituency
#PrasannaKumarPatasani
#PrithivirajHarichandan
#BJD
#BJP

ఒడిశాలోని 21 లోక్‌సభ నియోజకవర్గాల్లో భువనేశ్వర్ ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జయదేవ, భువనేశ్వర్ సెంట్రల్, భువనేశ్వర్ నార్త్, ఏకాంబర భువనేశ్వర్, జత్ని, బేగునియా, ఖుర్దా అసెంబ్లీ స్థానాలు ఈ లోక్‌సభ పరిధిలో ఉన్నాయి.

ఈ నియోజకవర్గం జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బిజూ జనతాదళ్ తరఫున ప్రసన్నకుమార్ పాటసాని గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్, బిజూ జనతాదళ్ అభ్యర్థులు విజయం సాధించారు. రెండుసార్లు సీపీఎం అభ్యర్థి ఇక్కడ గెలిచారు.

1952లో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పండిత్ లింగరాజ్ మిశ్రా విజయం సాధించారు. అప్పట్లో భువనేశ్వర్ స్థానాన్ని ఖుర్దా సీటుగా పరిగణించే వారు.

ఆ తరువాత 1957, 1962, 1967, 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. 1957 నాటి రెండో లోక్ సభ ఎన్నికల్లో నృసింహ చరణ్ సమంతసిన్హార్ గెలిచారు. 1962లో కాంగ్రెస్ కే చెందిన రాజా పీసీ దేవ్ భంజ్ విజయం సాధించారు. 1967, 1971లో అదే పార్టీకి చెందిన చింతామణి పాణిగ్రహి వరుసగా విజయాలను సాధించారు.

1977లో తొలిసారిగా భువనేశ్వర్ లోక్ సభ స్థానంలో సీపీఎం గెలిచింది. అప్పటి ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి శివాజీ పట్నాయక్ విజయం సాధించారు. ఆ తరువాత 1980, 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చింతామణి పాణిగ్రాహి గెలిచారు. మరో రెండుదఫాలు ఆయన వరుసగా భువనేశ్వర్ స్థానానికి ప్రాతినిథ్యం వహించారు.

1989లో మరోసారి విజయం సీపీఎం అభ్యర్థి శివాజీ పట్నాయక్ ను వరించింది. 1991లో కూడా ఆయనే గెలుపొందారు. 1996లో జరిగిన ఎన్నికల్లో భువనేశ్వర్ స్థానాన్ని మళ్లీ కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి సౌమ్యరంజన్ పట్నాయక్ ఇక్కడ గెలుపొందారు.

ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో బిజూ జనతాదళ్ వరుసగా అయిదుసార్లు గెలిచింది. బిజూ జనతాదళ్ అభ్యర్థి ప్రసన్నకుమార్ పాటసాని 1998లో తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇక అప్పటి నుంచీ ఆయనే ఆ లోక్ సభకు సభ్యునిగా గెలుస్తున్నారు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ప్రసన్న కుమార్ దే విజయం.

భువనేశ్వర్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 15,27,768 ఓటర్లు ఉన్నారు. వారిలో 8,35,850 మంది పురుష ఓటర్లు, 6,91,918 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2014లో 8,91,822 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వారిలో పురుష ఓటర్లు 4,83,992 మంది, మహిళా ఓటర్లు 4,07,830 మంది ఉన్నారు. ఆ ఎన్నికల్లో 58 శాతం ఓటింగ్ నమోదైంది.
Recommended