దిశ వాహనాలు ప్రారంభించిన సీఎం జగన్

  • 2 years ago
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతపై జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభించగా.. తాజాగా మరో ముందడుగు వేసి దిశ ఫోర్ వీలర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా 18 దిశ మొబైల్ విశ్రాంతి వాహనాలను ఏర్పాటు చేశారు. జిల్లా యూనిట్ కంట్రోల్ రూమ్ నుంచి నేరుగా ప్రత్యక్ష పర్యవేక్షణకు అనుగుణంగా జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉన్న వెహికల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

Recommended