Telangana: Congress Membership తీసుకున్నవారికి 2 లక్షల జీవిత బీమా Revanath Reddy | Oneindia
  • 2 years ago
Telangana Congress president Revanth Reddy, TPCC chief has announced that life insurance of Rs 2 lakh will be provided to everyone who joins the Congress party in Telangana.Revanath Reddy said the target was to register around 30 lakh digital members across Telangana. 7 lakh subscriptions have already been completed.
#Telangana
#TPCCchiefRevanathReddy
#Congress
#2lakhlifeinsurance
#Congressmembership
#TRS


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరి 2 లక్ష జీవిత బీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 30 లక్షల డిజిటల్ సభ్యత్వ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 7 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి 100 మందిని కాంగ్రెస్ కుటుంబంలో చేర్పించేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. బూత్‌లలో ఎక్కువ మందిని సభ్యత్వాలు నమోదు చేయించిన వారిని గాంధీభవన్‌కు పిలిచి స్వయంగా సన్మానిస్తామని తెలిపారు. అదే విధంగా మండల స్థాయిలో 10 వేలు, అసెంబ్లీ స్థాయిలో 50 వేలు, పార్లమెంట్ స్థాయిలో మూడున్నార లక్షల సభ్యత్వం చేయించిన వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
Recommended