హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి
  • 2 years ago
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరులోని కాట్టేరి అటవీ ప్రాంతంలో భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక హెలికాఫ్టర్ కూలిపోయింది. ఆ సమయంలో అందులో ప్రయాణిస్తున్న 14 మందిలో 13 మంది చనిపోయినట్టు నీలగిరి జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. వీరిలో భారత త్రివిధ దళాధిపతి (సీడీఎస్ చీఫ్) బిపిన్ రావత్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో అధికారికంగా ప్రకటించారు.
Recommended