Sania Mirza Trolled For Not Condemning Pulwama Incident& Sharing Her Pic | oneindia Telugu
  • 5 years ago
The whole nation is saddened after getting the news of 40 soldiers losing their lives in Pulwama and if at this moment, a celebrity starts tweeting about her dress and fashion, it is quite obvious that people will get angry and slam her.
#saniamirzaphoto
#pulwamaincident
#crpfjawans
#tennis
#instagram
#shoaibmalik
#Instagram
#netizens
#jammuandKashmir

భార‌త టెన్నిస్ స్టార్‌, పాక్ క్రికెట‌ర్ షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాపై నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఆమెపై నెటిజన్లు ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన సంగతి తెలిసిందే.

ఈ ఉగ్రదాడిలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం నాటికి ఆ సంఖ్య 44కు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ఘటన జరిగిన రోజున సానియా మిర్జా తాజాగా తీసుకున్న‌ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

దీంతో "పుల్వామా ఉగ్ర‌దాడి గురించి స్పందించ‌కుండా ఇలా ఫోటోలు పోస్ట్ చేస్తావా?" అంటూ ప‌లువురు నెటిజ‌న్లు ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "నీ ఫోటో చూసే ఆస‌క్తి మాకు లేదు. అంత పెద్ద దాడి జ‌రిగితే దాని గురించి క‌నీసం స్పందించ‌కుండా ఇలా ఫోటోలు అప్‌లోడ్ చేస్తావా" అంటూ ఓ నెటిజన్ ఆ ఫోటో కింద కామెంట్ పెట్టాడు.
Recommended