Today's News టుడే న్యూస్ అప్డేట్ 03-08-2018

  • 6 years ago
A cobra that was worshipped for over 27 days in Durgada village of Gollaprolu mandal, treating it as incarnation of Lord Subrahmanya Swamy was at last Lifeless on Thursday.
#snakeworshippedaslordsubramanya
#snakeindurgada
#EastGodavari
#durgadavillagersforsnake

1. రిలయన్స్ జియో, ఎస్బీఐల మధ్య కుదిరిన తాజా ఒప్పందంతో రెండు సంస్థల వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. డిజిటల్ చెల్లింపుల సేవలను మరింత మంది వినియోగదారులకు చేరువ చేసేందుకు రిలయన్స్ జియో-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లు చేతులు కలిపాయి. ఇందులో భాగంగా జియో పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఎస్బీఐ డిజిటల్ కస్టమర్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
2. జిల్లాలోని గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని పొలాల్లో గత 26రోజులుగా ఉండిపోయి గ్రామస్థులతో పూజలు అందుకుంటున్న పాము గురువారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. ఇన్ని రోజులుగా తమతో పూజలందుకుంటూ, ఎవరినీ ఏమీ చేయని నాగరాజు హఠాన్మరణంతో దుర్గాడ శోకసంద్రమైంది. అయితే పాము మృతికి గొల్లప్రోలు ఎస్ఐ శివకృష్ణ కారణమని ఆరోపిస్తూ, ప్రజలు జాతీయ రహదారిని ఏడు గంటల పాటు దిగ్బంధించారు. ఎస్ ఐ ఆ పాముని విషం పెట్టించి చంపాడని గ్రామస్తులు ఆరోపిస్తుండటంతో ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐపై కేసు నమోదు చేయడంతో పాటు ఆయనను విధుల నుంచి తప్పిస్తున్నట్టు డీఎస్పీ ప్రకటించారు.
3. లోక్‌సత్తా పార్టీ నాయకులు జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆదివారం నాడు లోక్‌సత్తా నేత కటారి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో తుదివిడత చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. ఎక్కువ మంది నాయకులు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

Recommended