రూ. 31 వేల కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం
  • 6 years ago
జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టాల్కమ్‌ పౌడర్‌‌లోని ఆస్బెస్టాజ్‌ వల్లే తాము కేన్సర్‌ బారిన పడ్డామంటూ 22 మంది మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు ఏకంగా 4.69 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.31,000 కోట్లు) పరిహారాన్ని చెల్లించాలని తీర్పును వెల్లడించింది. ఈ ఆసక్తికరమైన తీర్పును అమెరికాలో సెయింట్‌ లూయిస్‌లోని ఒక కోర్టు వెలువరించింది. తాత్కాలిక పరిహారం కింద 550 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.3500 కోట్లు) చెల్లించాలని ఆదేశాలిచ్చిన కొద్ది గంటల్లోనే పూర్తిస్థాయి నష్టపరిహారం 4.14 మిలియన్ డాలర్లు కూడా అందజేయాలని తీర్పునివ్వడం విశేషం. ఈ కేసులో జూన్‌ 4 న మొదలైన తుది వాదనలు బుధవారంతో ముగిశాయి.
Recommended