India Vs England 1st ODI: Rohit Sharma's New Record
  • 6 years ago
Riding on a terrific 167-run partnership between opener Rohit Sharma and skipper Virat Kohli, India on Thursday thumped England by 8 wickets in the first one-day international at Trent Bridge, Nottingham.Chasing a target of 269, India chased down the total with 59 balls remaining. Shikhar Shawan (40 off 27 balls) and Rohit Sharma provided India with a solid start, contributing 59 runs for the first wicket.
#kuldeepyadav
#india
#england
#1stodi

ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెట్టిన కుల్దీప్‌ యాదవ్‌ ఆరు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌ దృష్ట్యా ఏమంత కష్టం కానీ లక్ష్యాన్ని భారత్‌ సునాయాసంగానే ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మళ్లీ ఇంగ్లిష్‌ బౌలింగ్‌ను ఈజీగా చితక్కొట్టాడు. ఈ టూర్‌లో రెండు వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదేశాడు. చివరి టి20లోనూ శతక్కొట్టిన భారత ఓపెనర్‌ ఈ తొలి వన్డేలోనూ చెలరేగాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో ధావన్‌ (27 బంతుల్లో 40; 8 ఫోర్లు) ధాటి కొనసాగింది. అతను వేగంగా ఆడే పనిలో వెనుదిరగ్గా... తొలి వికెట్‌కు 59 పరుగులు జతయ్యాయి. తర్వాత కెప్టెన్‌ కోహ్లి క్రీజులోకి రాగా రోహిత్‌ ఆట మొదలైంది. ఇద్దరు చక్కని సమన్వయంతో బ్యాటింగ్‌ చేశారు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా పరుగులు జతచేశారు. దీంతో 15వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. ఇద్దరు అదును దొరికిన బంతిని బౌండరీకి తరలిస్తూ జట్టు రన్‌రేట్‌ పడిపోకుండా ఆడుకున్నారు. ఈ క్రమంలో మొదట రోహిత్‌ 54 బంతుల్లో (6 ఫోర్లు, 1 సిక్స్‌)... తర్వాత కోహ్లి 55 బంతుల్లో (5 ఫోర్లు) అర్ధసెంచరీల్ని పూర్తిచేసుకున్నారు. దీంతో 30 ఓవర్లకంటే ముందే 28.2 ఓవర్లలోనే జట్టు స్కోరు 200 దాటింది. మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌ల బౌలింగ్‌లో సిక్స్‌లు కొట్టిన రోహిత్‌ 82 బంతుల్లో (12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు. రెండో వికెట్‌కు 167 పరుగులు జోడించాక, జట్టు స్కోరు 226 పరుగుల వద్ద విరాట్‌ కోహ్లి స్టంపౌటైనా రోహిత్‌ శర్మ లాంఛనాన్ని పూర్తిచేశాడు.
Recommended