Harbhajan And Azharuddin Express Doubts Over The Yo-Yo Test
  • 6 years ago
Former cricketers Aakash Chopra and Mohammad Azharuddin have slammed the Indian cricket team's new selection criteria of the Yo-Yo test which every player needs to pass these days to get into the national team.
#cricket
#aakashchopra
#mohammadazharuddin
#india
#bcci
#viratkohli

టీమిండియా క్రికెటర్లకు ఫిట్‌నెస్ ఉండాలంటూ బీసీసీఐ నిర్వహించిన యోయో టెస్టు గురించి పలు సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒకవేళ టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ యో యో ఫెయిలైతే అతనిని కూడా నుంచి తప్పిస్తారా అని ప్రశ్నిస్తున్నారు మాజీ క్రికెటర్లు అజారుద్దీన్‌, ఆకాశ్‌ చోప్రా. ఐపీఎల్‌లో రాణించి యోయో టెస్టులో విఫలమైన అంబటి, సంజు శాంసన్‌‌లను జట్టు నుంచి తప్పించడం సరికాదన్నారు.
యో యో టెస్టు ఫలితం అంటూ వారిని జట్టు నుంచి తొలగించారంటూ ఆకాశ్‌ చోప్రా, అజారుద్దీన్‌, హర్భజన్‌ సింగ్‌‌లు ఎద్దేవా చేస్తున్నారు. ఈ సందర్బంగా స్పందించిన ఆకాశ్‌ చోప్రా.. ‘ఒకవేళ విరాట్‌ కోహ్లీ ఈ పరీక్ష ఫెయిలైతే.. అతడ్ని జట్టులో నుంచి తొలగిస్తారా?. ఒక టెస్టు పేరుతో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లను జట్టులో నుంచి తీసేయడం సరికాదు. మీరు కోహ్లీని ఆడించాలనుకున్నారు కాబట్టి అతనికి రెండు వారాలు విశ్రాంతి ఇచ్చి యో యో టెస్టు నిర్వహించారు. మిగతా ఆటగాళ్ల పట్ల అలాగే వ్యవహరించాలి 'అని అన్నాడు.
Recommended