ఆంధ్రప్రదేశ్ తెలంగాణల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు

  • 6 years ago
The southwest monsoon is set to cover the entire country in the next two days, almost a fortnight ahead of what it would normally take, even as it reached northwest India, including Delhi.
#weather
#monsoon
#weatherforecast

రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించనున్నాయి. ఢిల్లీతోపాటు వాయువ్య భారతదేశంలో వర్షాలు కురవనున్నాయి.
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. జులై 1 వరకు దేశం మొత్తం రుతుపవనాలు విస్తరించనున్నాయి. వాయువ్య భారతదేశంలో మాత్రం 15రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. రుతుపవనాల కారణంగా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ డీఎస్ పాయి తెలిపారు.
గుజరాత్, తూర్పు రాజస్థాన్, పశ్చిమరాజస్థాన్, హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ రుతుపవనాల కారణంగా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల కారణంగా రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తర అరేబియా సముద్ర ప్రాంతం, గుజరాత్, రాజస్థాన్ తోపాటు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్ 28న రుతుపవనాలు కేరళను చేరుకున్నాయి. నెల తొలి భాగంలో పశ్చిమతీరాన్ని ఇవి చుట్టేయనున్నాయి.

Recommended