Rangasthalam Creates New Records In Nizam

  • 6 years ago
Rangasthalam starring Mega Power Star Ram Charan and Samantha Akkineeni which was released on 30th March, 2018, became an instant blockbuster. Currently Rangasthalam is running successfully at the box office and on 18th May, Rangasthalam has successfully completed the successful run of 50 days.

తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల హవా ఇంకా కొనసాగుతునే ఉంది. ప్రధానంగా నైజాంలో ఈ చిత్రం రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకొన్నది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం సింగిల్ థియేటర్ల అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా, అలాగే నైజాంలో బాహుబలి తర్వాత భారీ కలెక్షన్లను కొల్లగొట్టిన చిత్రంగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది.
మల్టీప్లెక్స్ థియేటర్లు వచ్చిన తర్వాత సింగిల్ థియేటర్లను పట్టించుకొన్న దాఖాలాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ రంగస్థలం ఆ విషయాన్ని పక్కన పెట్టింది. ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లలో రూ.1,61,49,911 గ్రాస్ వసూళ్లను సాధించింది.
తెలంగాణలో ఓ సింగిల్ థియేటర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రంగస్థలం ఓ రికార్డు క్రియేట్ చేసింది. గతంలో ఈ రికార్డు సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన పోకిరి చిత్రంపై ఉండేది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆ రికార్డును రంగస్థలం తుడిపేసింది. ఈ కలెక్షన్లు రాంచరణ్ స్టామినాను చూపించాయి.

Recommended