పింక్ డైమండ్ పై చంద్రబాబు ను ప్రశ్నించిన పవన్
  • 6 years ago
చాన్నాళ్ల తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించే అవకాశముంది. శుక్రవారం గుంటూరు సమీపంలో జరగనున్న దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇద్దరు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది.
ఇక్కడి లింగమనేని టౌన్ షిప్ పక్కనే నూతన దేవాలయ నిర్మాణం ఇటీవల పూర్తయింది. దత్త పీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కానున్నారు. నాలుగు ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించగా గుడిలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. భారత దేశంలో దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహమున్న తొలి దేవాలయం ఇదే.
అంతకుముందు, పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంటులో గురువారం సాయంత్రం కూడా వరుస ట్వీట్లు పెట్టారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆభరణాల కోసం రమణదీక్షితులు దీక్ష చేస్తానంటే రాజకీయ పార్టీలకు లేదా వ్యక్తులకు భయం ఎందుకని జనసేనాని ప్రశ్నించారు. ఆయన దీక్షకు తాను మద్దతిస్తున్నానని చెప్పారు.
Recommended