ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన నిర్ణయం
  • 6 years ago
Telugudesam Party leaders complaint to speaker against YSR Congress party MLA Buggana Rajendranath Reddy on Wednesday.

పీఏసీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కొత్త ట్విస్ట్. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దానికి కౌంటర్‌గా ఇప్పుడు టీడీపీ నేతలు బుగ్గనపై స్పీకర్‌పై ఫిర్యాదు చేశారు. బుగ్గన టీడీపీ నేతలపై సభా హక్కుల నోటీసు ఇస్తే, టీడీపీ నేతలు కూడా స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు సంచలన ఆరోపణలు చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేత రామ్ మాధవ్‌కు కీలక పత్రాలు అందించారని ఆరోపించారు.
Recommended