Heroine Aditi Rao Hydari Exclusive Interview With Filmibeat
  • 6 years ago
Director Indraganti Mohan Krishna's latest movie is Sammohanam. Sudheer Babu and Aditi Rao Hydari are lead pair. Sivalenka Krishna Prasad is the producer. This movie is going to release on june 15th. In this occassion, Actress Aditi Rao Hydari speaks to Telugu Filmibeat.
#IndragantiMohanKrishna
#Sammohanam

భారతీయ చిత్రసీమలో ప్రతిభావంతురాలైన యువ తారల్లో అదితిరావు ఒకరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అదితిరావు బాలీవుడ్‌లో తనదైన రీతిలో రాణిస్తున్నారు. వనపర్తి సంస్థానానికి చెందిన రాజకుటుంబంలో జన్మించిన అదితి 2006లో మలయాళ చిత్రం ప్రజాపతితో కెరీర్ ప్రారంభించారు. సుధీర్ మిశ్రా రూపొందించిన యే సాలీ జిందగీ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత రాక్‌స్టార్, ఖూబ్‌సూరత్, వజీర్, పద్మావతి చిత్రంలో నటించారు. ప్రస్తుతం తెలుగు చిత్రం సమ్మోహనంలో హీరో సుధీర్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 12 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆమె తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. అదితి వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..
సమ్మోహనం చిత్రంలో సమీరా రాథోడ్ అనే హీరోయిన్ పాత్రను పోషిస్తున్నాను. మంచి కెరీర్ కోసం ప్రయత్నించే నటి. అందుకోసం ఆమె చాలా కష్టపడుతుంటారు. ఓ హిందీ నటి తెలుగు చిత్రంలో నటించే పాత్రను పోషించాను. వీటన్నింటికంటే ముఖ్యంగా ఈ చిత్రం ఓ లవ్ స్టోరి. రెండు విభిన్నమైన అభిరుచుల ఉండే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ప్రేమకథ.
తొలిసారి నేను నిజజీవితంలోని పాత్రను సమ్మోహనం చిత్రంలో పోషిస్తున్నాను. పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకొంటుంది. ఇందుకోసం పెద్దగా కష్టపడలేదు. ఇప్పటివరకు ఉన్న అనుభవంతో పాత్రకు అనుగుణంగా ఒదిగిపోయాను. సినిమా అంటే ఇష్టం. నటించడం తప్ప మరో ఆలోచన లేదు. ఓ రాత్రి అంతా నిద్ర లేకున్నా మరుసటి రోజున నేను కెమెరా ముందు యాక్టివ్‌గా ఉంటాను.
Recommended