Sammohanam Movie Pre-Release Event : Director Indraganti Mohan Krishna's Speech
  • 6 years ago
Director Indraganti Mohan Krishna's latest movie is Sammohanam. Sudheer Babu and Aditi Rao Hydari are lead pair. Sivalenka Krishna Prasad is the producer. This movie is going to release on june 15th. In this occassion, Director Indraganti Mohana Krishna speaks to Telugu Filmibeat.

తెలుగు సినిమా పరిశ్రమలో మంచి అభిరుచి కలిగిన దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. గ్రహణం, అష్టాచెమ్మా, అంతకు ముందు ఆ తర్వాత, జెంటిల్మన్ చిత్రాలు ఆయన ప్రతిభకు అద్దం పట్టాయి. తాజాగా సినిమా నేపథ్యంతో ఓ మంచి రొమాంటిక్ లవ్‌స్టోరి సమ్మోహనం చిత్రంతో ముందుకు వస్తున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ రూపొందించిన ఈ చిత్రంలో అదితిరావు, సుధీర్‌బాబు జంటగా నటించారు. ఈ చిత్రం జూన్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో ఇంద్రగంటి మోహనకృష్ణ తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంద్రగంటి వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..
సమ్మోహనం చిత్రం ఫైనల్ అవుట్‌పుట్ బ్రహ్మండంగా వచ్చింది. ఈ సినిమాకు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక చక్కగా కుదిరింది. ఈ సినిమాలో రకరకాల సమ్మోహనాలు ఉంటాయి. అదితిరావు చాలా అందంగా ఉంటుంది. సుధీర్‌బాబు నటనపరంగా, లుక్‌పరంగా చాలా కొత్తగా కనిపిస్తారు. ఆ పాత్ర నాకు చాలా ఇష్టపడ్డాను. సీనియర్ నటుడు నరేష్ ప్రధానమైన పాత్రలో కనిపించారు. గోల్కొండ హైస్కూల్ సినిమా షూట్ సందర్భంగా ఓ వ్యక్తి తారసపడ్డారు. ఆయన కథను పాయింట్ చేసుకొని ఈ స్టోరి రాసుకొన్నాను. దానిని ప్రేమకథగా మార్చాను.
హీరో తండ్రి పాత్ర నరేష్ పోషించారు. ఆయనకు సినిమా అంటే విపరీతమైన పిచ్చి. సినిమాను గొప్ప కళగా భావిస్తుంటారు. కానీ కొడుకు సినిమా అంటే ఇష్టం ఉండదు. ఇలా సినిమా మీద అభిప్రాయ బేధాలు ఉన్నప్పుడు అదితిరావు హీరోయిన్‌గా కథలోకి ప్రవేశించారు అనేది సమ్మోహనంలోని ఓ పాయింట్. ముందుగా నరేష్ పాత్రకు తనికెళ్ల భరణి, రావు రమేష్ అనుకొన్నాను. కానీ వారి ఇమేజ్ ఎక్కువగా ఉండటంతో నరేష్‌ను ఎంపిక చేశాను.
Recommended