Savithri Addicted To Alcohol Because of Jp Chandrababu
  • 6 years ago
Savitri was an Indian film actress, playback singer, dancer, director and producer. She appeared mainly in Telugu and Tamil language films but also in Kannada, Malayalam and Hindi language films. Savitri passed away on 26 December 1981, at the age of 45 and after being in a coma for 19 months. She had been an alcoholic for many years, having begun drinking heavily in 1969, and developed diabetes and high blood pressure. JP chandrababu one of the reason for her addiction towards alcholic.

దక్షిణాది ప్రేక్షకుల అభిమాన నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ చిత్రం తర్వాత ప్రస్తుత, భావి తరాల వారికి మహోన్నతమైన నటి జీవితంగా స్ఫూర్తి దాయకంగా నిలువనున్నది. మహానటిగా అవతరించే క్రమంలో సావిత్రి జీవితంలో ఒడిదుడుకులు ప్రతీ ఒక్కరికి ఆసక్తికరమే. సావిత్రి జీవితం విషాదకర పరిస్థితుల్లోకి నెట్టివేయబడటానికి అనేక కారణాలని చెప్పుకొంటారు. వ్యక్తిగత జీవితం సందిగ్ధంలో పడినప్పుడు సావిత్రి మద్యానికి అలవాటు పడ్డారు. అతిగా మద్యానికి వ్యసనపరురాలికాగా మారడానికి ఓ వ్యక్తి కారణమంటూ తాజాగా ఓ పేరు వెలుగులోకి వచ్చింది. అతడి పేరే జేపీ చంద్రబాబు.
తన కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ప్రముఖ నిర్మాత కూతురు షీలాను చంద్రబాబు వివాహం చేసుకొన్నారు. కానీ చంద్రబాబును వివాహం చేసుకోవడానికి ముందే ఆమెకు మరో వ్యక్తితో రిలేషన్ ఉంది. దాంతో వారి మధ్య వ్యక్తిగత విభేదాలు తలెత్తాయి. వారి వైవాహి జీవితం అర్దాంతరంగా ముగిసింది.
తన వైవాహిక జీవితం ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే చంద్రబాబు తీవ్ర నష్టాలపాలయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ను హీరోగా పెట్టి మాది విట్టు ఇజై అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎంజీఆర్, చంద్రబాబుకు మధ్య విభేదాలు వచ్చాయి. ఆ కారణంగా చంద్రబాబుకు ఎంజిఆర్ సహకరించలేదని చెప్పుకొంటారు. దాంతో ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.
చంద్రబాబు, యంజీఆర్ మధ్య విభేదాలకు ఓ ప్రత్యేక కారణం ఉంది. ఎంజీఆర్ సోదరుడు ఎంజీ చక్రపాణిని చంద్రబాబు దూషించడం వల్ల వారి మధ్య విభేదాలు చోటుచేసుకొన్నాయని ప్రముఖ సినీ రచయిత ఆరూర్ దాస్ తన ఆత్మకథలో చెప్పుకొన్నారు. చంద్రబాబును ఉద్దేశపూర్వకంగానే యంజీఆర్ సినిమా పరిశ్రమలో పైకిరాకుండా తొక్కేశారని సినీవర్గాలు చెప్పుకొంటాయి.
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో చంద్రబాబు తాగుడుకు అలవాటు పడ్డారు. మద్యం సేవించడం వ్యసనంగా మారింది. ఈ క్రమంలోనే సావిత్రితో మంచి అనుబంధం ఏర్పడింది. చంద్రబాబు ఎదురైన పరిస్ఠితులో ఆ సమయంలో సావిత్రి గారిని వెంటాడాయి.
Recommended