చిరంజీవి ఏం పీకలేకపోయాడు, 2019 మాదే ?

  • 6 years ago
YS Jaganmohan reddy Cuts the Cake in padayatra on Monday during YSRCP formation day celebrations.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కేక్ కట్ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ సోమవారం ఉదయం ఈపురుపాలెంలో నేతలు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్‌ కట్‌ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజు విలువలతో కూడిన రాజకీయాలను అందించేందుకు.. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పురుడు పోసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కుల సాధన కోసం అండగా నిలుస్తూ పోరాడుతూనే.. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తాం' అని ఆయన ట్వీట్‌ చేశారు. ఇక ఇంతకాలం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు, తనకు అండగా నిలుస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వైయస్‌ జగన్‌ మరో ట్వీట్‌ చేశారు.

Recommended