Chandrababu Naidu Counter Strategy on YSRCP MPs Resignation

  • 6 years ago
Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu strategy is MPs resignation to counter YSR Congress party chief YS Jagan.

ప్రత్యేక హదా కోసం ఏప్రిల్ 6వ తేదీన తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద పైచేయి సాధించారు. అయితే, దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. క్రెడిట్ జగన్‌కు వెళ్లకుండా ఏం చేయాలనే విషయంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. బిజెపితో తెగదెంపులు చేసుకోవడమా, రాజీనామాల పర్వానికి తెర లేపడమా అనేది ఆయన తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు.
ఏప్రిల్ 6వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేస్తే అవి ఆమోదం పొందుతాయా, లేదా అనే మాట పక్కన పెడితే రాజీనామాలు చేయడానికి సిద్ధపడడమే పెద్ద విషయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందుకు వచ్చింది. ఎంపీల చేత రాజీనామా చేయించడానికి జగన్ జంకుతున్నారనే తెలుగుదేశం పార్టీ విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చినట్లయింది.
జగన్ ప్రకటనతో చంద్రబాబు ఇరుకున పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంటు వెలుపలా, లోపల తమ ఎంపీలు పోరాటం చేస్తున్నారని చెప్పి తప్పించుకోవడానికి చంద్రబాబుకు వీలు లేకుండా పోయింది. బిజెపితో స్నేహంగా ఉంటేనే పనులు అవుతాయనే వాదనకు కూడా బలం లేకుండా పోయింది. అందుపల్ల చంద్రబాబు తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతలో పడ్డారని అంటున్నారు.
జగన్‌ను కౌంటర్ చేయాలంటే చంద్రబాబు కూడా రాజీనామాల పర్వానికి తెర తీయాల్సిందే. ఎంపీల చేత గానీ మంత్రుల చేత గానీ ఆయన రాజీనామాలు చేయించాల్సి ఉంటుంది. ఈ విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించాలా, పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయించాలా అనే విషయంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

Recommended