Vira Sivareddy sensational comments ysr కుటుంబంపై షాకింగ్ కామెంట్స్..

  • 6 years ago
When YS Rajasekhar Reddy alive, his family haven't tasted the defeat, Now due to YS Jagan's incapablity only they are defeating, Vira Sivareddy said. After YS Rajasekhar Reddy's loss his son YS Jagan entered from business field to political field, Jagan almost failed in this field, he added.
టీడీపీ నేత వీరశివారెడ్డి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం రాజకీయ చరిత్రలో ఆ కుటుంబానికి ఓటమి అనేదే తెలియదని, జగన్ చేతకానితనం వల్ల ఇప్పుడు ఆ కుటుంబానికి ఓటమి శకం మొదలైందని వ్యాఖ్యానించారు. వైయస్ మరణానంతరం వ్యాపారరంగం నుంచి జగన్ రాజకీయాల్లోకి వచ్చారని... ఆయన అసమర్థ రాజకీయాలతోనే వారి రాజకీయ కోట బీటలువారుతోందని వీరశివారెడ్డి ఎద్దేవా చేశారు.

గత ఎన్నికల్లో వైఎస్ జగన్ విశాఖ నుంచి తన మాతృమూర్తి విజయమ్మను పోటీకి నిలబెట్టారని, అయినా ఫలితం లేకపోయిందని, ఆవిడ గెలిస్తే పులివెందుల సంస్కృతి ఎక్కడ విశాఖకు పాకుతుందో అనే భయంతోనే ... అక్కడి ప్రజలు విజయమ్మను తిప్పికొట్టారని ...

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సామాన్యుడి చేతిలో... ఓటమే ఎరుగని వైయస్ వివేకానందరెడ్డి సైతం ఓడిపోయారని .. గత ఎన్నికల్లో వైసీపీ తరపున 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారని... అయితే, జగన్ అసమర్థత కారణంగా 23 మంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీ నుంచి దూరంగా వచ్చేశారని ఎద్దేవా చేశారు.

Recommended