No-Trust Motion : Union Home Ministry Calls AP Officials
  • 6 years ago
The Union government sent information to the AP state to come to Delhi for meeting on Feb 23.Union Home ministry will conduct this meeting with Ap state government officials on Ap re- organisation act.

ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెడతామని వైసీపీ ప్రకటించింది. ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా హట్‌హట్‌గా మారాయి. ఈ తరుణంలో కేంద్రం నుండి రాష్ట్రానికి మంగళవారం నాడు పిలుపు వచ్చింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఢిల్లీకి రావాలని సమాచారం పంపడం రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకొంది. ఏపీ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌‌లో నిధుల కేటాయింపు విషయమై పార్టీలన్నీ పెదవి విరుస్తున్నాయి. ఏపీ రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయలేదని పార్టీలన్నీ ఆందోళన బాట పట్టాయి. కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న టిడిపి కూడ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం తీరును నిరసిస్తూ టిడిపి ఎంపీలు కూడ ఆందోళన బాట పట్టాయి. ఈ తరుణంలో ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా తీసుకోవాలని ఏపీలోని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రంపై అవిశ్వాసానికి తాము రెడీగా ఉన్నామని వైసీపీ ప్రకటించింది.
కేంద్రంపై అవిశ్వాసాన్ని పెట్టాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీలను కోరారు. దీనికి వైసీపీ స్పందించింది.కేంద్రంపై తాము అవిశ్వాసాన్ని ప్రతిపాదించనున్నట్టు ప్రకటించింది.
ఏపీలో చోటు చేసుకొంటున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి 23వ, తేదిన ఢిల్లీకి రావాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఢిల్లీకి రావాలని కేంద్రం నుండి మంగళవారం నాడు సమాచారాన్ని ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన ప్రాజెక్టులు, నిదుల విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బడ్జెట్ కేటాయింపుల విషయమై ఏపీ ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్న తరుణంలో కేంద్రం నుండి పిలుపు రావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
Recommended