Today's Top 10 News టుడే టాప్ 10 న్యూస్

  • 6 years ago
North Karnataka bandh : Farmers resort to protest for Mahadayi Kalasa Banduri. While hundreds of Farmers taken out rally for Mahadayi issue from BJP office to Rajbhavan hit Bengaluru traffic in various places.
And Former MP Vundavalli Arun Kumar said Telangana Chief Minister K Chandrashekar Rao has not invited AP Chief Minister N Chandrababu Naidu due to political reasons.

సీఎం చంద్రబాబుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పొగడ్తలు కురిపించారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. వెనుకబడిన వర్గాలను ఆదుకునేలా ఆర్థిక విధానాలు ఉండాలని, సామాజిక భద్రత ఉండేలా ప్రభుత్వ పాలసీలుండాలని కోవింద్ సూచించారు.

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర నూతన సీఎంగా జైరామ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. ఠాకూర్‌చే ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్ ప్రమాణస్వీకారం చేయించారు. సిమ్లాలోని ప్రఖ్యాత రిడ్జ్ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం ఉదయం అట్టహాసంగా జరిగింది.

మనది కానిదాని కోసం ఆశపడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ ఘటన చూస్తే తెలుస్తోంది. తాజాగా ముంబైలో జరిగిన ఘటన ఇందుకు మంచి ఉదాహరణ. ఓ వ్యాపారి రూ.510 కోసం కారు దిగితే.. రూ.10 లక్షల విలువైన వజ్రాలను కోల్పోవాల్సి వచ్చింది.

Recommended