తెలంగాణా పరువు తీసిన కవిత,కేసీఆర్ మాట్లాడరేం విజయశాంతి సూటిప్రశ్నలు *National | Telugu OneIndia
  • 2 years ago
Vijaya shanthi said that MLC Kavitha, who is involved in Delhi liquor scam, has defamed Telangana and why KCR is not talking about this matter. He concluded that TRS countdown has started | ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఉన్న ఎమ్మెల్సీ కవిత తెలంగాణా పరువు తీశారని, ఈ విషయంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని విజయశాంతి మండిపడ్డారు. టీఆర్ఎస్ కౌంట్ డౌన్ మొదలైందని తేల్చి చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తనదైన శైలిలో మండిపడ్డారు. బీజేపీ నాయకుల పై కెసిఆర్ కూతురు పరువు నష్టం దావా వేయడం కాదు కెసిఆర్ కుటుంబం పై తెలంగాణ ప్రజలు పరువు నష్టం దావా వేయాలని అనుకుంటున్నారని విజయశాంతి పేర్కొన్నారు. అవినీతిలో కేసీఆర్ కుటుంబం లిమిట్ దాటిందని విజయశాంతి వెల్లడించారు. బీజేపీ శ్రేణులు తిరగబడితే మీరు తట్టుకోలేరని విజయశాంతి తేల్చిచెప్పారు.


#BJP
#VijayaShanthi
#TRS
#MLCkavitha
#CMkcr
#Telangana
#PMmodi
Recommended