IND vs NZ 1st T20 In Trouble క్రికెట్ మ్యాచులపై కన్నేసిన కాలుష్యం || Oneindia Telugu

  • 2 years ago
India Vs New Zealand: Atmosphere deteriorates in Jaipur before India-New Zealand T20 series starts, first match in trouble
#INDVSNZ1stT20
#IndiaVsNewZealand
#JaipurAQI
#SawaiMansinghStadium
#AirPollution

భారత పర్యటనలో కివీస్ మూడు టీ20ల సిరీస్, రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. నవంబర్ 17న ఇరు జట్ల మధ్య పొట్టి సిరీస్ ఆరంభం కానుంది. అయితే జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగే టీ20 మ్యాచ్‎పై అనుమానాలు నెలకొన్నాయి.ప్రస్తుతం తొలి టీ20 జరిగే జైపూర్ గాలిలో కాలుష్యం స్థాయి బాగా పెరిగినట్లు తెలుస్తుంది. జైపూర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం గత వారం నుంచి జైపూర్‎లో కాలుష్యం స్థాయి పెరిగింది. ఆదివారం జైపూర్‌లో గాలి అత్యంత దారుణంగా ఉందని, పొగ మంచు బాగా ఉందని నివేదిక పేర్కొంది. గాలి ఏక్యూఐ 337 వద్ద నమోదైంది. దీపావళి తర్వాత ఈ స్థాయిలో ఏక్యూఐ నమోదవడం ఇది రెండోసారి. తొలి టీ20 జరిగే సమయానికి కూడా ఎయిర్ ఏక్యూఐ ఇంచుమించు స్థాయిలో ఉంటుందని సమాచారం. దాంతో టీ20 మ్యాచ్‎పై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ జరిగేది లేనిది ఆరోజు తేలనుంది.

Recommended