భారత్‌లో కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్
  • 3 years ago
భారత మార్కెట్లో జీప్ కంపెనీ తన కొత్త కంపాస్ ఫేస్‌లిఫ్ట్‌ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ధర దేశీయ మార్కెట్లో రూ. 16.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్). కొత్త జీప్ కంపాస్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైంది. డెలివెరీ త్వరలో ప్రారంభమవుతుంది. 2021 జీప్ కంపాస్‌ను 4 ట్రిమ్స్ మరియు 11 వేరియంట్లలో అందిస్తున్నారు. ఇందులో స్పోర్ట్, లాంగిట్యూడ్, లిమిటెడ్ మరియు మోడల్ 'ఎస్' ఉన్నాయి. ఇందులో టాప్ మోడల్‌ ధర రూ. 24.49 లక్షల వరకు ఉంటుంది. దీనితోపాటు 80 వ యానివర్సరీ ఎడిషన్‌ను కూడా తీసుకువచ్చారు. దీని ధర రూ. 22.96 లక్షలు.

2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.
Recommended