Delhi Assembly Elections : Arvind Kejriwal Slams Parvesh Verma And Asks People To Vote BJP Not AAP

  • 4 years ago
Delhi Assembly Elections 2020 : Delhi Chief Minister Arvind Kejriwal on BJP MP Parvesh Verma calling him terrorist, I leave it on people of Delhi, if you think I am a terrorist then press 'Kamal' button on 8th February Kejriwal sadi.If you think I have worked for Delhi, the Country and the people then press 'Jhaadu' button.
#DelhiAssemblyElections
#DelhiAssemblypolls
#DelhiPolls
#parveshverma
#ArvindKejriwal
#AAPVSBJP
#Delhiexitpoll
#aamaadmiparty
#modi
#Kejriwalvsmodi
#caa
#opinionpoll
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం పతాక స్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు గురువారం సాయంత్రం తెరపడబోతున్న నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఢిల్లీ వాతావరణం వేడెక్కింది. వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా దేశ రాజధానిలో కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు.. ఈ ఎన్నికల ప్రచార వివాదాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
ఇదే పౌరసత్వ సవరణ చట్టం నిరసనలను అడ్డు పెట్టుకుని బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్రమంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్, లోక్‌సభ సభ్యుడు పర్వేష్ వర్మ ఓ అడుగు ముందుకేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిగా అభివర్ణించారు. దీనికి ధీటుగా స్పందించారు కేజ్రీవాల్. బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు చేస్తోన్న వ్యాఖ్యలపై ఆయన ఎదురుదాడికి దిగారు.

Recommended