పోలవరంపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు : మల్లాది || Malladi Vishnu Slams TDP Over Polavaram
  • 5 years ago
Malladi Vishnu Slams TDP Over Polavaram,Fires on opposition leader nara chandrababu naidu.
#malladivishnu
#ysrcongressparty
#assemblybudgetsession
#polavaramproject
#tdp
#ysrcp
#chandrababunaidu
#ysrcp
#ysjagan
#amaravathi
#vijayawada
#andhrapradesh

పోలవరం ప్రాజెక్టుపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. శుక్రవారం శాసనసభలో టీడీపీ సభ్యులు ప్రవర్తనపైన ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పోలవరంపై చర్చ జరగకూడదని టీడీపీ భావిస్తోందన్నారు. టీడీపీ సభ్యులు సభలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. శాసనసభను పోలవరం పేరుతో టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నవంబర్‌ 1 నుంచి పోలవరం పనులు ప్రారంభిస్తామని సీఎం శాసనసభలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పోలవరంలో టీడీపీ ఇష్టానుసారం అవినీతి చేసిందని ధ్వజమెత్తారు.
Recommended