India Vs New Zealand : Pandya Brothers Are Playing For India In T20s | Oneindia Telugu

  • 5 years ago
India's all-rounder Haridak Pandya and his brother krunal pandya will be playing for India for the first time in an international cricket match.The Pandya Brothers will be recognized as the third brothers to play international cricket for India.
#indiavsnewzealand
#haridakPandya
#krunalpandya
#thirdbrothers
#t20s
#lalaamarnath
#mohinderamarnath
#surinderamarnath
#irfanpathan
#yusufpathan

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, అతని సోదరుడు కృనాల్‌ పాండ్యాలు తొలిసారి భారత్ తరుపున ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో కలిసి ఆడనున్నారు. ఇందుకు న్యూజిలాండ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌ వేదిక కానుంది. పాండ్యా బ్రదర్స్‌ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటికి ఇప్పటి వరకు ఇద్దరూ ఒక్క మ్యాచ్‌లో కూడా అడలేదు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్, కృనాల్ పాండ్యాలు బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఇదే జరిగేతే పాండ్యా సోదరులు అరుదైన ఘనత సాధించనున్నారు. భారత్ తరుపున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన మూడో బ్రదర్స్‌గా గుర్తింపు పొందనున్నారు. అంతకముందు భారత్ తరుపున అమర్‌నాథ్‌ సోదరులు, పఠాన్‌ సోదరులు ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో భారత్ తరుపున కలిసి ఆడారు.భారత్‌ తరఫున తొలి టెస్ట్‌ సెంచరీ సాధించిన లాల అమర్‌నాథ్‌ కుమారులైన మహిందర్‌ అమర్‌ నాథ్‌, సురీంధర్‌ అమర్‌ నాథ్‌లు భారత్‌ తరపున.... బ్రదర్స్‌గా తొలిసారి బరిలోకి దిగారు. ఆ తర్వాత ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఈ జాబితాలో చేరారు. పఠాన్‌ సోదరులు ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించారు.

Recommended