వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం...!

  • 6 years ago
The low pressure developed in North west of Bay of Bengal has affected the two telugu states.Moderate to heavy rains are likely expected in AP and Telangana. As of now major projects like Srisailam and Jurala are almost full. The inflow has slightly increased in Srisailam reservoir.
#bayofbengal
#cyclone
#heavyrains
#srisailam
#jurala
#WeatherReport


వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 18న ఇది వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు తెలగురాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులకు వరద నీరు పెరుగుతోంది. ఇక కర్నాటకలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగిపోతోంది. తుంగభద్ర ఇన్‌ఫ్లో 2లక్షల క్యూసెక్కులకు పెరగడం, నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నమోదైంది. ఇది ఇలానే కొనసాగితే శ్రీశైలం రిజర్వాయర్ నిండే అవకాశముంది. ఇప్పటికే అధికారులు జలవిద్యుత్‌ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఆల్మటి డ్యామ్‌లో 1.11 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో త్వరలోనే నాగార్జున సాగర్‌కు నీరు వచ్చి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Recommended