Trekking Places In Andra Pradesh ఆంధ్రప్రదేశ్ లో ట్రెక్కింగ్ ప్రదేశాలు

  • 6 years ago
At a distance of 66 km from Nandyal, 137 km from Kurnool, 114 km from Kadapa, 348 km from Vijayawada, 350 km from Hyderabad and 407 km from Bangalore, Ahobalam is an important pilgrimage center located in the Kurnool district of Andhra Pradesh. A
#Ahobalam

ఆంధ్రప్రదేశ్ లో ట్రెక్కింగ్ ఇప్పుడిప్పుడే ప్రాచూర్యంలో వస్తోంది. ముఖ్యంగా యువత ఈ సాహస క్రీడ పై మక్కువ పెంచుకొంటూ ఉన్నారు. అదే విధంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కూడా వారాంతాల్లో ట్రెక్కింగ్ వెళ్లడానికి ఉవ్వళ్లూరుతున్నరు. ఇందుకోసం వివిధ ప్రాంతలను ఎంపిక చేసుకొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రాంతాలకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో మీ కోసం వివరిస్తున్నాం. ఇందులో నాగలాపురం, గండికోట, శ్రీశైలం, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, అహోబిలం ఉన్నాయి. ఇదిలా ఉండగా ట్రెక్కింగ్ ఒంటరిగా కాకుండా గుంపుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా నిపుణుడైన గైడ్ తప్పక అవసరం. స్థానిక పోలీసు, అటవీ అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వడం ఉత్తమం.
ఆంధ్రప్రదేశ్ లోని నల్లమలా అడవుల్లో అహోబిలం ఉంది. ఇది ప్రముఖ ధార్మిక ప్రాంతం కూడా. కర్నూలు జిల్లాలో భాగమైన ఈ అహోబిలం బెంగళూరు నుంచి 407 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన అడవిలో ఎతైన చెట్లు, గతుకుల రోడ్ల పై నడుచుకొంటూ చుట్టూ ఉన్న ప్రక`తి అందాలను చూస్తూ నడుచుకొంటూ పోతే ఇట్టే సమయం గడిచిపోతుంది. ట్రెక్కింగ్ దారిలో మీకు చిన్న చిన్న గుహలు, జలపాతాలు పలకరిస్తాయి.

Recommended