సతీమేతంగా హాజరైన పవన్ కళ్యాణ్..ఇందుకోసమేనా ??

  • 6 years ago
ప్రముఖ తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడో సినిమా ఫంక్షన్లలో తప్పితే బయట ఎక్కువగా కనిపించరు. ఇక ఆయన భార్య, ఫ్యామిలీ మెంబర్స్ అత్యంత అరుదుగా మీడియా దృష్టిలో పడుతుంటారు. వారి గురించిన వివరాలు కూడా పెద్దగా ఎవరికీ తెలియవు. ఇటీవల రవీంద్ర భారతిలో త్రివిక్రమ్ భార్య సౌజన్య భరతనాట్యం డాన్స్ ప్రదర్శన ఇవ్వడం చర్చనీయాంశం అయింది. త్రివిక్రమ్ భార్యలో ఇంత గొప్ప టాలెంట్ అంటూ పలువురు ఆశ్చర్య పోయారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సౌజన్య ప్రదర్శించిన పలు నృత్యరూపాలు సభికులను ఆకట్టుకున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీకి వచ్చిన ఇంత కాలమైనా ఆయన సతీమణి నాట్య కళాకారిణి అనే విషయం చాలా మందికి తెలియక పోవడం గమనార్హం.
ఈ నాట్య ప్రదర్శన కార్యక్రమానికి సినీ నటుడు, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సౌజన్యను ప్రశంసలతో ముంచెత్తారు.
ఈ వేడుకకు కొణిజేటి రోశయ్య, జమున, రిటైర్డ్ ఐఏఎస్ కెవి రమణ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లాంటి ప్రముఖులు హజరయ్యారు.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న అరవింద సమేత చిత్రంపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. వీరి కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. బలమైన యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. భారీ నెలకొన్న అంచనాలతో ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అదేస్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజగా అరవింద సమేత ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

Recommended