Virat Kohli Lauds Entire Team For Showing Character In Decider
  • 6 years ago
బ్రిస్టల్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో విజయం సాధించి మూడు టీ20ల సిరిస్‌ను 2-1తేడాతో సొంతం చేసుకోవడంలో బౌలర్లు కీలకంగా వ్యవహారించారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు.
ఈ మ్యాచ్‍‌లో తొలుత భారీగా పరుగులిచ్చిన బౌలర్లు, ఆతర్వాత ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన విధానంపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. పది ఒవర్లు ముగిసిన తర్వాత టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడాడు.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "ఇంగ్లండ్‌ మొదటి పది ఓవర్ల ఆట మమ్మల్ని ఆందోళనకు గురి చేసింది. అదే ఫామ్‌ను వారు చివరి వరకు కొనసాగించి ఉంటే 225-230 పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచేవారు. ఒకవేళ ఇదే స్కోరును ఇంగ్లండ్‌ నమోదు చేసి ఉంటే మా గెలుపు కష్టమయ్యేది" అని అన్నాడు.

Indian captain Virat Kohli on Sunday (July 8) praised his team-mates for showing character in tight situations in the seven-wicket win in the third and final T20 International to clinch the series 2-1 here.
#viratkohli
#teamindia
#rohitsharma
#hardikpandya
#msdhoni
Recommended