Rohit Sharma Becomes Third Indian To Reach 2000 T20I Runs
  • 6 years ago
వీరోచిత ఇన్నింగ్స్ ఆడి విమర్శకుల నోళ్లు మూయించాడు రో'హిట్' శర్మ. టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. భారీ టార్గెట్ ను ఛేదించే దిశగా భారత్‌కు చక్కని ఇన్నింగ్స్‌ను అందించాడు. దీంతో రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
ఇంగ్లాండ్‌తో ఆదివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మెరుపు శతకం బాదిన రోహిత్ శర్మ (100) 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో టీ20ల్లో 2,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కి ముందు వరకు 1,986 పరుగులతో ఉన్న రోహిత్.. తాజా సెంచరీతో 2,086 పరుగులతో నిలిచాడు. భారత్ తరఫున రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లి మాత్రమే 2,102 పరుగులను పూర్తి చేశాడు.

Rohit Sharma becomes third Indian after Virat Kohli and Mithali Raj and overall fifth to reach 2000 Twenty20 International runs. He touches this feat in the 3rd match against England on Sunday, July 8 at Bristol.
#rohitsharma
#t20
#cricket
#england
#india
Recommended