చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగిన మేకపాటి
  • 6 years ago
YSRCP MP Mekapati Rajamohan Reddy on Friday Slams Andhra Pradesh CM Chandrababu Naidu for Polavaram project issue.
#MPMekapatiRajamohanReddy

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు డయా ఫ్రమ్ వాల్ కట్టి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు.
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే పోలవరం పూర్తి చేస్తామన్న చంద్రబాబు.. ఇప్పటికీ పూర్తి చేయలేదని మండిపడ్డారు.
పోలవరానికి ఫౌండేషన్ వేసింది దివంగత సీఎం వైయస్సార్ అని, ఆయన ఉంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని ఎంపీ మేకపాటి అన్నారు. ఆయన హయాంలోనే 39శాతం వరకూ పనులు పూర్తయ్యాయని ఎంపీ చెప్పారు.
‘పోలవరం మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.58కోట్లు.. ఇప్పటివరకు పెట్టింది రూ.13,500కోట్లు ఖర్చుపెట్టామంటున్నారు. కేంద్రం పూర్తి చేస్తామంటే.. ఆ బాధ్యతలను సీఎం చంద్రబాబు తీసుకున్నారు. చంద్రబాబు వల్లే పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి' అని ఎంపీ మేకపాటి ఆరోపించారు.
Recommended