బాబు ఎలాంటివాడంటే: ఓటుకు నోటును లాగిన పవన్ కళ్యాణ్
  • 6 years ago
Jana Sena chief Pawan Kalyan on Sunday said that Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu is fearing with cash for voter.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగింది. జనసేనాని నరసన్నపేట, అక్కడి నుంచి పాతపట్నం చేరుకున్నారు. పాతపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కవాతు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులను, వారసత్వ రాజకీయ నాయకులను తరిమేద్దామన్నారు. కేంద్రం విభజన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విభజన హామీల విషయంలో బీజేపీ, టీడీపీలది తప్పు ఉందన్నారు. నాలుగేళ్లలో 36సార్లు మాట మార్చారన్నారు. ప్రత్యేక హోదా కోసం జనసేన చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందని చెప్పారు. ఏపీకి హోదా ఇస్తేనే న్యాయం జరుగుతుందన్నారు.
ఇసుక మాఫియా పెరిగిపోయిందని పవన్ మండిపడ్డారు. శ్రీకాకుళంలో ఉన్న పాలకులను పెకిలించి, బద్దలు కొట్టి తీరాలని వ్యాఖ్యానించారు. భూమాతకు, భూదేవికి గౌరవం ఇవ్వకుంటే పాతాళానికి పోతారని హెచ్చరించారు. గిరిజనులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే అందరూ భాగస్వాములు కావాలని జనసేనాని
Recommended