Uday Kiran Sister Talks About Chiranjeevi Family

  • 6 years ago
The news that maverick director Teja is planning to make a biopic on Telugu actor Uday Kiran has become a talking point among everyone. Same days back Uday Kiran sister Sridevi said interesting details. "Uday had a hit a rough patch in his personal life after the breakup with a girl he loved. He was sobbing a lot. Chiranjeevi was very supportive during his down time. He was like Uday's Godfather. And even Uday had a lot of respect for him. Chiranjeevi advised him a lot to move on and after some time he came up with the marriage proposal saying Sushmitha liked Uday. He is a wonderful person."
#UdayKiran
#Sridevi
#Sushmitha

తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పరిశ్రమలో ఓ సంచలనం. అప్పట్లో ఆయన మరణంపై అనేక పుకార్లు, అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే దేనికీ సరైన సమాధానం ఇప్పటికీ దొరకలేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతోందని, దానికి తేజ దర్శకత్వం వహించబోతున్నారని వార్తలు తెరపైకి రావడంతో మరోసారి ఈ యంగ్ హీరో గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకైతే దర్శకుడు తేజ ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించలేదు. అదే నిజమైతే ఉదయ్ కిరణ్ సోదరి చెప్పిన విషయాలు చూపిస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్ అయింది.
ఉదయ్ కిరణ్ మరణించిన సమయంలో రకరకాల వార్తలు వినిపించాయి. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి మాట్లాడుతూ తమ్ముడు మరణించే సమయంలో ఫైనాన్షియల్ సమస్యలున్నట్లు, పాల ప్యాకెట్లకు కూడా డబ్బు లేవు అనే వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అబద్దం. మియా పూర్, శంషాబాద్ ప్రాంతాల్లో మూడు ల్యాండ్స్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకులో గోల్డ్ ఉంది. మనీ లేక పోవడ కారణం కాదు, సినిమాల్లేక పోయినా జీవించే స్తోమత ఉంది తన తమ్ముడికి అని వెల్లడించారు.
అమ్మ చనిపోయాక నాన్నకు, తమకు మధ్య దూరం పెరిగిపోయింది. నాన్న వేరే అమ్మాయితో ఉంటటం తమ్ముడికి నచ్చలేదు. ఎవరైనా అమ్మ ప్లేసులో ఇంకొకరిని ఊహించుకోలేరు. నేను కూడా తమ్ముడి సైడే ఉండిపోయాను అని శ్రీదేవి తెలిపారు.
తమ్ముడు తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నాడు. అన్నవరంలో మేమే పెళ్లి పెద్దలుగా ఉదయ్-విషిత పెళ్లి జరిపించాము. మేము మస్కట్లో ఉంటాం. వాడి పెళ్లి తర్వాత 2013 జూన్ లో బంధువుల పెళ్లిలో ఆఖరుగా చూశాను. ఎప్పుడు ఫోన్ చేసినా ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. విషిత ఎప్పుడూ మాట్లాడేది కాదు. ఆమె గురించి అడిగితే బయటకు వెళ్లిందని చెప్పేవాడు. చాలా సంతోషంగా ఉన్నాననే చెప్పేవాడు. విషితను చాలా ప్రేమించాడు. హెవెన్ లో ఉన్నాననే చెప్పేవాడు. వారు సంతోషంగా లేరని ఆ సమయంలో ఎప్పుడూ డౌట్ కూడా రాలేదు అని శ్రీదేవి తెలిపారు.
తమ్ముడి మరణం తర్వాత విషిత మాతో టచ్‌లో లేకుండా పోయింది. ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఉదయ్ ప్రాపర్టీ అంతా తన చేతిలోనే ఉంది. ఉదయ్ ఉన్నపుడు భార్యతో సమస్య ఉందని కూడా చెప్పలేదు. బయట కూడా వారు హ్యాపీగా ఉన్నట్లే ఉంది. ఉదయ్ మరణం తర్వాత జరిగిన సంఘటనలు కొన్ని అనుమానం కలిగించాయి. కానీ నేను మస్కట్ లో ఉంటాను కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలిసేది కాదు అని శ్రీదేవి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.

Recommended