గోవా, మణిపూర్ రిపీట్ కాకుండా పావులు కదిపిన ప్రియాంక గాంధీ
  • 6 years ago
Karnataka Election results are in very interesting. Entire Nation is looking at Karanataka Elections. Election results are in trending stage. BJP, Congress is neck to neck situation. Karanataka leading towards Hung assembly. BJP crosses 100 seats. Celebrations in the form of slogans have begun in the headquarter of the BJP in Bengaluru as the party has crossed the 100 mark. BJP failed to reach its halfway mark in Karnataka assembly is 113. JDS happy over Congress CM post proposal.
#KarnatakaAssemblyElections2018
#PriyankaGandhi
#RahulGandhi
#Congress
#JDS

కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. గవర్నర్ కోర్టులో బంతి ఉండటంతో తదుపరి ప్రభుత్వాన్ని ఎవరూ చేపట్టనున్నారో తెలియనుంది. ఇదిలా ఉంటే కన్నడనాట ఏ పార్టీకి మెజారిటీ లభించని నేపథ్యంలో జేడీ(ఎస్)కు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. కర్ణాటక రాజకీయాలను కుదిపేసే నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకోవడం వెనుక సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ చతురతతో కూడిన నిర్ణయమేనట.. హంగ్ ఏర్పడిన సభలో ఎవరూ ప్రభుత్వాన్ని చేపడుతారంటూ ఓ పక్క విశ్లేషణ జరుగుతుంటే ప్రియాంక సంచలన నిర్ణయం రాజకీయ పండితులను ఆలోచనలో పడేసింది.. ఇంతకీ ఈ వ్యవహారంలో ఏమి జరిగిందంటే..
కర్ణాటకలో ముందు నుంచి జేడీఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ అయిష్టతను ప్రదర్శిస్తూ వచ్చారు. కానీ ఎన్నికల ఫలితాలు తర్వాత సంక్షోభం నెలకొనడంతో ప్రియాంక గాంధీ చకచకా పావులు కదిపారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో రాష్ట్రంలో కీలక పాత్ర వహించడానికి జేడీఎస్‌కు మద్దతు తెలపాలని, కుమారస్వామికి సీఎం పదవిని ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారంట.
గోవా, మణిపూర్‌లో జరిగిన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొన్న కాంగ్రెస్ కర్ణాటకలో ముందస్తు జాగ్రత్తలు తీసుకొన్నది. ఓ పక్క ఫలితాలు వెలువడుతుంటడగానే పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌ను రంగంలోకి దించింది.
Recommended