ఫిలిం ఛాంబర్ లో పవన్ తో మెగా ఫ్యామిలీ తో భేటీ
- 6 years ago
Jana Sena chief Pawan Kalyan on friday went to Film Chamber to talk about Sri Reddy issue.
శ్రీరెడ్డి ఇష్యూ కాస్త రాజకీయ రంగు పులుముకుంది. పవన్ను టార్గెట్ చేయడంతో ఎవరో ఉన్నారనే అనుమానాలు జనసేనకు బలపడ్డాయి. తెరపైకి రామ్ గోపాల్ వర్మ వచ్చారు. దీంతో అల్లు అరవింద్, నాగబాబు, రామ్ చరణ్ తేజ-రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచింది. మరోవైపు శ్రీరెడ్డి, వర్మ ఓ మెట్టు దిగారు. కానీ నేరుగా పవన్ తల్లిని టార్గెట్ చేయడం వివాదం ముదిరింది.
పవన్ కళ్యాణ్ శుక్రవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేయిస్తున్న వారికి అమ్మలు, అక్కలు, కోడళ్లు ఉన్నారని, కానీ వారి ఇంట్లో మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారని, టీఆర్పీలు, రాజకీయ లాభాల కోసం వయసైపోతున్న తన 70 ఏళ్ల తల్లిని దూషిస్తున్నారని, టీఆర్పీల కోసం పోటీ పడుతున్నారని మండిపడ్డారు.
అనంతరం, పవన్ కళ్యాణ్ నేరుగా ఫిలిం ఛాంబర్కు వచ్చారు. ఆయనతో పాటు నాగబాబు, అల్లు అర్జున్ హాజరయ్యారు. వీరు పవన్కు మద్దతుగా ఫిలిం చాంబర్కు వచ్చారు. న్యాయవాదులతో భేటీ అయ్యారు. అంతేకాదు, సినీ ప్రముఖులు అందరూ చాంబర్కు రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అవుదామని చెప్పారు.
ఫిలిం చాంబర్లో పవన్ కళ్యాణ్ రెండు వైపులా తలుపులు పెట్టుకొని గదిలో కూర్చున్నట్లుగా తొలుత వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఇంత జరుగుతుంటే మౌనంగా ఎందుకు ఉన్నారని ఫిలిం చాంబర్లో పలువురిని ప్రశ్నించారని తెలుస్తోంది. దీనిపై మాట్లాడేందుకే సమావేశానికి ప్రముఖులు రావాలని పిలుపునిచ్చారు.
ఫిలిం చాంబర్కు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వచ్చారని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. వారిని చూసేందుకు ఎగబడ్డారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పైన కుట్ర జరుగుతోందని జనసేన అభిప్రాయపడుతోంది. గత ఆరు నెలలుగా పవన్ పైన కుట్ర సాగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరెడ్డి ఇష్యూ కాస్త రాజకీయ రంగు పులుముకుంది. పవన్ను టార్గెట్ చేయడంతో ఎవరో ఉన్నారనే అనుమానాలు జనసేనకు బలపడ్డాయి. తెరపైకి రామ్ గోపాల్ వర్మ వచ్చారు. దీంతో అల్లు అరవింద్, నాగబాబు, రామ్ చరణ్ తేజ-రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచింది. మరోవైపు శ్రీరెడ్డి, వర్మ ఓ మెట్టు దిగారు. కానీ నేరుగా పవన్ తల్లిని టార్గెట్ చేయడం వివాదం ముదిరింది.
పవన్ కళ్యాణ్ శుక్రవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేయిస్తున్న వారికి అమ్మలు, అక్కలు, కోడళ్లు ఉన్నారని, కానీ వారి ఇంట్లో మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారని, టీఆర్పీలు, రాజకీయ లాభాల కోసం వయసైపోతున్న తన 70 ఏళ్ల తల్లిని దూషిస్తున్నారని, టీఆర్పీల కోసం పోటీ పడుతున్నారని మండిపడ్డారు.
అనంతరం, పవన్ కళ్యాణ్ నేరుగా ఫిలిం ఛాంబర్కు వచ్చారు. ఆయనతో పాటు నాగబాబు, అల్లు అర్జున్ హాజరయ్యారు. వీరు పవన్కు మద్దతుగా ఫిలిం చాంబర్కు వచ్చారు. న్యాయవాదులతో భేటీ అయ్యారు. అంతేకాదు, సినీ ప్రముఖులు అందరూ చాంబర్కు రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అవుదామని చెప్పారు.
ఫిలిం చాంబర్లో పవన్ కళ్యాణ్ రెండు వైపులా తలుపులు పెట్టుకొని గదిలో కూర్చున్నట్లుగా తొలుత వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఇంత జరుగుతుంటే మౌనంగా ఎందుకు ఉన్నారని ఫిలిం చాంబర్లో పలువురిని ప్రశ్నించారని తెలుస్తోంది. దీనిపై మాట్లాడేందుకే సమావేశానికి ప్రముఖులు రావాలని పిలుపునిచ్చారు.
ఫిలిం చాంబర్కు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వచ్చారని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. వారిని చూసేందుకు ఎగబడ్డారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పైన కుట్ర జరుగుతోందని జనసేన అభిప్రాయపడుతోంది. గత ఆరు నెలలుగా పవన్ పైన కుట్ర సాగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.