జనసేన పార్టీ కార్యాలయం వద్ద లెఫ్ట్ నేతలకు చేదు అనుభవం..!
  • 6 years ago
Andhdrapradesh state left parties leaders Madhu and Ramakrishna met Janasena chief Pawan Kalyan on Thursday at hyderabad party office. Pawan kalyan will visit Anantapur district on April 15 and 16.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో ఏపీ రాష్ట్రానికి చెందిన సిపిఎం, సిపిఐ నేతలు గురువారం నాడు హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు. అనంతపురం, విజయనగరం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 15, 16 తేదిల్లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీలతో కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. ఈ పార్టీలు ఉమ్మడిగా సభలు నిర్వహించాలనే యోచనలో ఉన్నాయి. ఈ మేరకు అనంతపురం జిల్లా నుండే ఉమ్మడి సభలను ప్రారంభించాలని ఆ పార్టీ నేతలు సూచనప్రాయంగా గతంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయాలపై లెఫ్ట్ పార్టీల నేతలతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు చర్చించనున్నారు.
అనంతపురం జిల్లా పర్యటన తర్వాత వెంటనే విజయనగరం జిల్లాల్లో కూడ పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాల పర్యటనకు సంబంధించి లెఫ్ట్ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. ఈ సాయంత్రానికి రెండు జిల్లాల పర్యటనకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనంతపురం, విజయనగరం జిల్లాల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి చర్చించేందుకు సిపిఐ, సీపీఎం నేతలు గురువారం నాడు హైద్రాబాద్‌కు వచ్చారు.
జనసేన పార్టీ కార్యాలయం వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధును జనసేన కార్యాలయం సెక్యూరిటీ గార్డులు నిలిపివేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఖమ్మం జిల్లాకు చెందిన జనసేన నాయకులతో సమావేశంలో ఉన్నారు. జనసేన పార్టీ నాయకుల అనుమతి వచ్చేవరకు తాము గేటు తీయబోమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో లెఫ్ట్‌పార్టీల నేతలిద్దరూ జనసేన పార్టీ కార్యాలయం గేటు బయటే 10 నిమిషాల పాటు ఎదరుచూశారు. ఈ తరుణంలో విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ నేతలు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో లెఫ్ట్ పార్టీల నేతలు మధు, రామకృష్ణను జనసేన పార్టీ కార్యాలయంలోనికి అనుమతించారు.
Recommended