యువకుడి దారుణ హత్య, బెంగళూరు లో ఉండే తెలుగు వాళ్ళు జాగ్రత్త

  • 6 years ago
Group of three persons made lost life a man in running BMTC bus near electronic city. The bus was coming to Bengaluru from Anekal.

బెంగళూరు నగరంలో ప్రతినిత్యం సంచరించే బీఎంటీసీ (సిటీ బస్సు)లో పట్టపగలు ప్రయాణికులు అందరూ చూస్తున్న సమయంలో యువకుడిని వేటకోడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపేశారు. ప్రత్యర్థి చనిపోయాడని నిర్దారించుకున్న తరువాత హంతకులు దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. హత్యకు గురైయ్యింది ఆంధ్రా యువకుడని, హంతకులు రాయలసీమ యాసలో మాట్లాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
బుధవారం తమిళనాడు శివార్లలోని అనేకల్ నుంచి బెంగళూరులోని మెజస్టిక్ కు బీఎంటీసీ బస్సు బయలుదేరింది. మార్గం మధ్యలో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని కూనప్పన అగ్రహార దగ్గర బస్సు డ్రైవర్ కొంత వేగం తగ్గించాడు.
బస్సు మెల్లిగా వెలుతున్న సమయంలో ఓ యువకుడు (32) పరుగున వచ్చి బస్సులో ఎక్కాడు. అదే సమయంలో యువకుడిని వెంబడించిన ముగ్గురు అదే బీఎంటీసీ బస్సులో ఎక్కారు. చేతిలో ఉన్న వేటకోడవళ్లతో యువకుడి మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు.
యువకుడి మీద వేటకోడవళ్లతో దాడి చేస్తున్న సమయంలో డ్రైవర్ బస్సు నిలిపివేశాడు. ప్రయాణిలకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకు పరుగు తీశారు. యువకుడి మీద దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు వీడు చచ్చాడు పదండిరా అంటూ తెలుగులో గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయారు.
బీఎంటీసీ బస్సులో యువకుడు హత్యకు గురైనాడని తెలుసుకున్న ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. హంతకుల్లో 60 ఏళ్ల వృద్దుడు, 30 ఏళ్లు వయసు ఉన్న ఇద్దరు యువకులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసులు అన్నారు.

Recommended