KTR Immediate Action On Anchor Pradeep's Tweet

  • 6 years ago
Telangana IT Minister KTR responded on Anchor Pradeep Machiraju tweet over toilet issue in Govt school Charlapalli. KTR given assurance to take immediate action.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. అధికారులను పురమాయించి యుద్దప్రాతిపదికన సమస్య పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. తాజాగా టీవీ యాంకర్ ప్రదీప్ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి ఓ సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. అధికారులను చర్యలకు ఆదేశించారు.
'టాయిలెట్ లేని పాఠశాల' పేరుతో ఓ స్వచ్చంద సంస్థ ట్విట్టర్ లో ఒక పోస్టు పెట్టింది. చర్లపల్లిలో 40ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాలకు ఇప్పటికీ టాయిలెట్ వసతి లేదని, స్కూల్లో చదువుకుంటున్న 120మంది బాలికలు, 100మంది బాలురు ఇబ్బందులు పడుతున్నారని ట్వీట్ ద్వారా ఆ ఎన్జీవో తెలియజేసింది. టాయిలెట్ లేని కారణంగా విద్యార్థులు భోజనం తర్వాత మంచినీళ్లు కూడా తాగడం లేదని.. నీళ్లు తాగితే టాయిలెట్ కోసం చాలాదూరం వెళ్లాల్సి వస్తోందన్న కారణంతోనే ఇలా చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్‌కు కేటీఆర్‌ను కూడా ట్యాగ్ చేసింది.
ఎన్జీవో చేసిన ట్వీట్‌పై యాంకర్ ప్రదీప్ మాచిరాజు స్పందించారు. తమ టీమ్ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి సమస్యను పరిశీలించిందని.. నిజంగానే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయని, ప్రధానంగా బాలికల సమస్య కోసం ఏదైనా చేయాలని ట్విట్టర్ ద్వారా ఆయన కేటీఆర్‌ను కోరారు.
ప్రదీప్ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. పని పూర్తయ్యాక ఆ ఫోటోల్ని కూడా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలని అన్నారు. అందుకు అనుగుణంగా మేడ్చల్ కలెక్టర్ నుంచి కూడా స్పందన రావడం విశేషం. 'సార్.. డీఈవో రేపు వెళ్లి ఆ పాఠశాల టాయిలెట్లను పరిశీలిస్తారు. పాత టాయిలెట్ల స్థానంలో కొత్తవి నిర్మించడానికి చర్యలు తీసుకుంటాం' అంటూ ట్వీట్ చేశారు.

Recommended