పవన్ కు 'ఓయూ' వార్నింగ్ ! 'కత్తి' జోలికొస్తే ?
  • 6 years ago
Osmania University students supported film critic Mahesh Kathi and they warned Pawan Kalyan. On Friday at arts college they arranged a meeting to support mahesh kathi.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్-మహేష్ కత్తి మధ్య వివాదం ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. దాదాపు నాలుగు నెలల నుంచి ఇరువురి మధ్య ఎడతెగని వివాదం రగులుతూనే ఉంది. హీరోయిన్ పూనంకౌర్ ఎంట్రీతో వివాదం మరో మలుపు తిరిగింది.
ఇదిలా ఉంటే, సినీ ఇండస్ట్రీ నుంచి రచయిత కోన వెంకట్ సహా పలువురు పవన్ కు అండగా నిలబడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ కత్తికి కూడా ఓయూ జేఏసీ నుంచి మద్దతు లభించడం గమనార్హం.
మహేష్ కత్తికి మద్దతుగా ఓయూ జేఏసీ నాయకులు శుక్రవారం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో సంఘీభావ సమావేశం నిర్వహించారు. మహేష్ కత్తి హాజరైన ఈ సమావేశంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కత్తికి ఉస్మానియా జాయింట్ యాక్షన్ కమిటీ పూర్తి మద్దతు ప్రకటించింది.
సమావేశంలో పవన్ కల్యాణ్‌పై ఓయూ జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పవన్ కల్యాణ్ అభిమానులు కత్తి మహేష్‌పై దాడి చేస్తే చూస్తూ ఊరుకోం. కత్తి మహేష్‌పై దాడి గనుక జరిగితే పవన్‌ను తెలంగాణలో తిరగనివ్వబోం.. పవన్ సినిమాలను తెలంగాణలో అడనివ్వబోం.' అని హెచ్చరించారు.
సమావేశంలో మహేష్ కత్తి మాట్లాడుతూ పవన్ అభిమానుల తీరును తప్పు పట్టారు.పవన్ కల్యాణ్ తన అభిమానులను వేరే పార్టీలకు అమ్ముకుంటున్నాడని ఆయన ఆరోపించారు. అభిమానులను తనపైకి ఉసిగొల్పుతున్నారని, ఇప్పటికైనా వాళ్లను అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
Recommended