విసుగెత్తిపోయిన రాజమౌళి.. చరణ్-ఎన్టీఆర్‌ మూవీపై కీలక నిర్ణయం! | Filmibeat Telugu
  • 6 years ago
Rajamouli next with Ram Charan and Jr NTR in the lead roles would have no graphics at all. This was stated by none other than Rajamouli himself.

బాహుబలి-2 తర్వాత దర్శకుడు రాజమౌళి ఏ సినిమాలు చేస్తారు? అనే విషయంలో ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ టాప్ స్టార్స్ అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఆయన మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారు. బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. ఇందులో ఇద్దరూ స్టార్లు బాక్సర్లుగా కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రం గురించి అఫీషియల్ ప్రకటన చేస్తూ టైటిల్ ప్రకటించనున్నారు.
‘బాహుబలి -2' విడుదల అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ తన తర్వాతి సినిమా ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా చేస్తాని చెప్పారు. ఆ మాట ప్రకారమే రాజమౌళి తన సినిమాను ప్లాన్ చేసుకుంటున్నారట.
ఏ సినిమాకు అయినా కథను బట్టే గ్రాఫిక్స్ వాడటమా? లేదా? అనేది ఆధారపడి ఉంటుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్-ఎన్టీఆర్ సినిమా ఎలాంటి గ్రాఫిక్స్ అవసరం లేదని, అందుకు తగిన విధంగానే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు సిద్ధం చేసుకున్నారని టాక్.
Recommended