Modi's Government Has Stopped Central Funds To AP Schemes
  • 6 years ago
Giving another shock to Andhra Pradesh CM Nara Chandrababu Naidu's government, Narendra Modi's union government has stopped central funds to AP schemes.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు చెందిన కొన్ని పనులకు జారీ చేసిన టెండర్లను నిలిపేయాలంటూ ఆదేశాలు ఇచ్చిన కేంద్రం తాజాగా మరో ఝలక్ ఇచ్చినట్లు తేలింది. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా మార్గదర్శక సూత్రాలతో పనులను చేపడితేనే తదుపరి నిధులు వస్తాయనే షరతులతో కూడిన విధివిధానాలు అమలులోకి వచ్చాయి. దాంతో కేంద్ర పథకాలకు రావాల్సిన నిధులు ఆగిపోయినట్లు తెలుస్తోంది.
కేంద్ర నిధులతో చేపట్టే పనుల్లో ఎక్కడా కేంద్రం ప్రస్తావన ఉండడం లేదని, వాటిని రాష్టమ్రే నిర్వహిస్తుందనే పద్దతిలో ప్రచారం సాగుతోందని ఢిల్లీ నుంచి వచ్చిన సర్వే బృందాలు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదికతో పాు బీజేపీ నేతల ఫిర్యాదులు చేయడం వంటి కారణాల వల్ల కేంద్ర పథకాలకు అందాల్సిన నిధులు ఆగిపోయినట్లు తెలుస్తోంది.
ఉపాధి హామీ పథకంతోపాటు వివిధ పథకాలకు సంబంధించి గ్రామాల్లో జరిగే పనులకు గత పక్షం రోజులుగా నిధుల రాక నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రాష్ట్రం చేపట్టిన ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలోని ఉపాధి హామీ పథకం వాటా నిధులు నిలిచిపోయినట్లు సమాచారం.
Recommended