A photo goes viral on Internet : రాంచరణ్, NTR,మహేశ్‌ మల్టీస్టారర్ ?

  • 6 years ago
SS Rajamouli, NTR, Ram Charan photo goes viral on Internet.This photo sets fire in Social media too. After Rajamouli post, Lot of news floodingon the Internet.Rep

బాహుబలి సినిమా తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు జక్కన షాకిచ్చారు. ఇటీవల మెగాపవ్ స్టార్ రాంచరణ్, యంగ టైగర్‌ ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను రాజమౌళి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దాంతో ఆ ఫోటో వైరల్‌గా మారింది. ఈ ఫోటో సోషల్ మీడియాకు నిప్పు పెట్టినంత పనిచేసింది.రాజమౌళి మధ్యలో కూర్చొని ఉండగా ఒకవైపు రాంచరణ్, మరోవైపు ఎన్టీఆర్ పట్టేసుకొన్నారు. నాతోనే సినిమా చేయాలి. మనం సినిమా చేద్దా అనే రేంజ్‌లో నిన్ను వదలను బొమ్మాలి అనే అంతగా ఫొటోకు ఫోజిచ్చారు. ఈ ఫోటో ఇప్పుడు దేశవ్యాప్తంగా హల్‌చల్ రేపుతున్నది.
సినీ దర్శకుడిగా రాజమౌళి, హీరోగా ఎన్టీఆర్ ప్రయాణం స్టూడెంట్ నంబర్ 1తో ప్రారంభమైంది. ఆ తర్వాత తీసిన సింహాద్రి జక్కన్నను, తారక్‌ను అగ్ర హీరో, దర్శకుడిగా మార్చేశాయి.
ఆ తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన యమదొంగ సెన్సేషనల్ సక్సెస్‌ను సాధించింది. అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
ఇక రాంచరణ్‌ను సినిమా గ్రాఫ్‌ను పెంచిన సినిమా మగధీర. ఈ చిత్రం రాజమౌళి దర్శక ప్రతిభకు మెరుగులు దిద్దిన చిత్రం. బాహుబలి లాంటి సినిమాపై ఆలోచన పెట్టడానికి ఓ కారణమైన సినిమాగా మగధీరను చెప్పుకొంటారు. అలాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్లీ రాజమౌళి, రాంచరణ్ కాంబినేషన్‌లో సినిమా రాలేదు. వీరి కలయికలో సినిమా వస్తే ఎంత బాగుంటుందో అనే ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.ఇదిలా పక్కన పడితే.. బాహుబలి తర్వాత కమిట్‌మెంట్ ప్రకారం డీవీవీ దానయ్యతో రాజమౌళి సినిమా చేయాల్సి ఉన్నది.

Recommended