30 YSRCP MLAs Are In Touch With TDP To Join | Oneindia Telugu

  • 7 years ago
Telugu Desam Party leader and Minister KS Jawahar on Thurday said that 30 YSR Congress Party MLAs are touch with Telugu Desam Party to join.
నిన్న నంద్యాల, నేడు కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో టిడిపిలో ఉత్సాహం కనిపిస్తోంది. వైసిపికి వరుస ఓటముల నేపథ్యంలో టిడిపి నేతలు వైయస్ జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర ఉన్న సమయంలో వైసిపికి ఈ ఫలితాలు షాకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు వైసిపి నేతలు టిడిపితో టచ్‌లో ఉన్నారని, ఆ పార్టీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. తాజాగా, మంత్రి కెఎస్ జవహర్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. జగన్‌ రాజకీయ జీవితం ముగిసిందని ఎద్దేవా చేశారు. నంద్యాల ఎన్నికల తర్వాత కూడా జగన్‌లో మార్పు రాకపోవడంతో వైసిపికి చెందిన 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని బాంబు పేల్చారు.

Recommended